హైదరాబాద్ మియాపూర్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. భార్య, భర్త, వారి చిన్నారి, అత్తామామలు మృతుల్లో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ కలహాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.