ఆంధ్రప్రదేశ్లోని మిర్చి రైతులకు కేంద్రం ఊరట నిచ్చే నిర్ణయం తీసుకుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చి పంటను సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ఎంఐఎస్ స్కీమ్ కింద మిర్చి పంటను సేకరించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు పెమ్మసాని చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం మిర్చి రైతులకు ఉపయోగపడుతుందని ట్వీట్ చేశారు.