Jupally on Gold To Miss World Contestant: హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీలపై రాజకీయ దుమారం రేగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పోటీల నిర్వహణపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంటెస్టెంట్లకు 30 తులాల బంగారం పంచిందని ఆరోపించగా, మంత్రి జూపల్లి కృష్ణారావు వాటిని ఖండించారు. హరీష్ రావు ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ప్రభుత్వం కేవలం 31 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. ఆవివరాలు..