మంత్రి సవితపై మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో నిర్వహించిన వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో పాల్గొన్న ఉషశ్రీ చరణ్.. సవితపై విరుచుకుపడ్డారు. పెనుగొండ నీ అబ్బ జాగీరా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాటిల్ మీద రూ.10 తింటున్నావ్ సిగ్గులేదా అంటూ మండిపడ్డారు. దీనికి సంబంధించి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.