కొత్తిమీర ధరలు కొండెక్కుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడం, తెగుళ్లు, డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేని కారణంగా కొత్తిమీర ధరలు పెరుగుతున్నాయి. కడప జిల్లాలో తోటల వద్దే 50 కట్టల కొత్తిమీర బస్తా 1500 వరకూ పలుకుతోంది. దీంతో ఇవి మార్కెట్లోకి చేరేసరికి కొత్తిమీర ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో పంటలు అందుబాటులోకి వచ్చే వరకూ కొత్తిమీర రేటు తగ్గకపోవచ్చని మార్కెట్ వర్గాలు, వ్యాపారులు చెప్తున్నారు.