మద్యం, గంజాయి, డ్రగ్స్కు బానిసలై యువత ప్రాణాలు కోల్పోతుండటంపై కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి చేసిన భావోద్వేగ ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మద్యం మత్తులో యాక్సిడెంట్కు గురై ప్రాణాలు కోల్పోయిన ఒక యువకుడి అంతిమయాత్రలో ఆయన మాట్లాడుతూ.. క్షణకాలపు మత్తు కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దని స్నేహితుడి చావుతోనైనా మిగిలిన వారిలో మార్పు రావాలని హితవు పలికారు.