మీ భూమి కబ్జాకు గురైతే తిరిగి పొందడం ఎలా..? ఎన్నారైలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

2 weeks ago 8
మన దేశంలో కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల తర్వాత గణనీయమైన సంఖ్యలో ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. అమెరికా, ఆస్ట్రేలియా ఇలా ఒక్కటేమిటి ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన.. అక్కడో భారతీయుడు, అందులోనూ తెలుగువారు ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. అయితే విదేశాలకు వెళ్లి స్థిరపడినప్పటికీ.. తమ సొంతూరిలో, స్వస్థలంలో కొంత భూమిని కలిగి ఉండాలనే ఎన్నారైల కల పీడకలగా మారుతోంది. విదేశాల్లో కష్టపడుతూ తమ కష్టార్జితాన్ని ఎన్నారైలు తమ సొంతూర్లలో.. భూములు, ఇతరత్రా ఆస్తుల రూపంలో పెట్టుబడి పెడుతున్నారు. ఇలాంటి వారిని అనేక సమస్యలు ఇబ్బందులు పెడుతున్నాయి. తిరుపతిలోని తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ గోరా రాజేంద్రప్రసాద్ అనే ఎన్నారై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోతో.. ఎన్నారైల ఇబ్బందులపై చర్చ జరుగుతోంది.
Read Entire Article