మీ సేవ సెంటర్లలో పెరిగిపోతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. దళారుల ఆగడాలు పెరిగిపోతుండటంతో ఒకేసారి పలు మీ సేవ సెంటర్లపై దాడులు నిర్వహించారు. ప్రజలకు జారీ చేసే సర్టిఫికెట్లలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో.. ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.