విద్యాశాఖ ఉన్నతాధికారులు చేసిన తప్పు.. ఓ వ్యక్తి కలల్ని కాల రాసింది. అతడి ఆశలపై నీళ్లు గుమ్మరించింది. ప్రభుత్వ కొలువు సాధించానని మురిసిపోయిన అతడికి భారీ షాక్ ఇచ్చారు అధికారులు. ఏం జరిగిందంటే.. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి డీఎస్సీలో హిందీ పండిట్గా ఎంపికై, తొమ్మిది నెలలు ఉద్యోగం చేశాడు. అయితే, అధిక మార్కులు సాధించిన మహిళ హైదరాబాద్ స్థానికురాలని తెలియడంతో, అతడిని తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యోగం కోల్పోయిన ఆ వ్యక్తి, తనను అన్యాయంగా తొలగించవద్దని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.