తెలంగాణలో నైరుతి రుతుపవనాలు అనేవి ఈ సంవత్సరం తొందరగానే ప్రవేశించాయి. కానీ ఆశించినంత మేర వర్షం మాత్రం రాలేదు. మధ్యలో కొన్ని రోజులు అక్కడక్కడ వర్షపాతం నమోదు అయినా.. ఆశించిన మేర కురవలేదు. అయితే గత 10 రోజుల నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నాయి. రాబోయే 24 గంటట్లో హైదరాబాద్లోని ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది జీహెచ్ఎంసీ.