Rs 5 Crore Donated For Veda Patashala In AP: ఏపీలోని భీమవరానికి చెందిన రిటైర్డ్ ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ వెంకటరామయ్య, తన భార్య జయలక్ష్మితో కలిసి పెన్నాడ అగ్రహారంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వేద పాఠశాలకు రూ.5 కోట్ల భారీ విరాళం అందించారు. ఇందులో రూ.3 కోట్ల విలువైన రెండెకరాల భూమి, రూ.2 కోట్ల నగదు ఉన్నాయి. తల్లిదండ్రుల స్మృతిగా సాహిత్య పురస్కారాలు అందిస్తూ, సేవా కార్యక్రమాలు చేపడుతున్న వెంకటరామయ్య తన సొంత ప్రాంతంపై ప్రేమను చాటుకున్నారు.