నాదర్గుల్ భూముల వ్యవహారంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతి ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నాదర్గుల్ భూములకు సంబంధించి 2014లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేసిందని ఆయన ఆధారాలు బయటపెట్టారు. ప్రభుత్వ పథకాలకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, పాత తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటగట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఈ భూముల వ్యవహారంలో మంత్రి హరీష్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని అన్నారు. తమ ప్రభుత్వ పనితీను ఓర్వలేక ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు.