ఏపీలో మత్స్యకారుల అంశంపై అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మద్య మాటల యుద్ధం జరుగుతోంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సందర్శన సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మత్స్యకారుల కడుపు మీద తంతోందంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జగన్ ఆరోపణలకు అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో మత్స్యకారులను మోసం చేస్తే.. కూటమి ప్రభుత్వం వారి కడుపు నింపుతోందని కౌంటర్ ఇచ్చారు.