ప్రస్తుతం సమాజంలో కల్తీకి కాదేది అనర్హం అన్న చందంగా మారింది. తినే తిండి దగ్గర నుంచి తాగే నీళ్లు, పాల వరకు కూడా కల్తీ చేసేస్తున్నారు. దీంతో ఏది కొనాలన్నా.. అనుమానించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉదయాన్ని వేడివేడిగా తాగే టీకి సంబంధించి పొడిలో కూడా కల్తీ చేసేశారు దుర్మార్గులు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.