ప్రధాని మోదీ, కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. కీలక విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్తోపాటు సార్వత్రిక ఎన్నికలు కొన్ని నెలల ముందుగా నిర్వహించాలని సూచించారు. రోజురోజుకూ పెరిగిపోతున్న ఎండల నేపథ్యంలో.. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడంతో.. ప్రజలకు, నేతలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. అందుకే ముందస్తు ఎన్నికలు పెట్టాలని విజయసాయిరెడ్డి రిక్వెస్ట్ చేశారు.