బనకచర్ల ప్రాజెక్టు అంశంపై ఆంధ్రప్రదేశ్ మంత్రుల వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గట్టిగా బదులిచ్చారు. బనకచర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కృష్ణా, గోదావరి నదుల నీటి వాటాలు తేల్చిన తర్వాతే కొత్త ప్రాజెక్టుల గురించి చర్చ జరగాలని స్పష్టం చేశారు. ఏపీ మంత్రుల ప్రకటనలను తాము పట్టించుకోమని తేల్చి చెప్పారు.