Telangana Cabinet Meeting Key Decisions: తెలంగాణ మంత్రివర్గం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతను సమావేశమైంది. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం ఆకృతికి ఆమోదం లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్కు జూలై 30లోగా సమగ్ర వివరాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు సాయంత్రం రైతు నేస్తం సభ నిర్వహిస్తారు. నూతన క్రీడా విధానం కూడా ఆమోదం పొందింది. అన్ని కలెక్టర్ల కార్యాలయాల వద్ద తెలంగాణ తల్లి నమూనా ప్రతిమలను పెట్టాలని నిర్ణయించారు. హుజూరాబాద్ న్యాయ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభిస్తారు. పెండింగ్ బిల్లులపై చర్చించారు.