తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన మేడారం మహా జాతర ముగిసింది. గత నాలుగు రోజులుగా గద్దెలపై కొలువై నిలువెత్తు బంగారంతో భక్తుల పూజలందుకున్న సమ్మక్క, సారలమ్మలు గద్దెలను వీడి వన ప్రవేశం చేశారు. ఆదివాసీ సంప్రదాయలతో పూజారులు తల్లులను శనివారం సాయంత్రం వన ప్రవేశం చేయించారు. దీంతో అధికారికంగా ఈ ఏడాది జాతర ముగిసంది.