Chandrababu on AP Population: ఆంధ్రప్రదేశ్లో జనాభా పెరుగుదల తగ్గడంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు జనాభా నియంత్రణ గురించి మాట్లాడిన ఆయన, ఇప్పుడు జనాభా నిర్వహణ అవసరమని అన్నారు. ముగ్గురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారే నిజమైన దేశభక్తులని, జనాభా పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందని తెలిపారు. ప్రత్యుత్పత్తి రేటు 2.1గా ఉంటేనే జనాభా స్థిరంగా ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.