ముత్యాలమ్మ ఆలయ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

1 year ago 19
Revanth Reddy: ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గోషామహల్‌లో నిర్వహించిన ఫ్లాగ్ డే పరేడ్‌లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం ప్రసంగిస్తూ.. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన ఘటనను ఉటంకించారు. ప్రజల్లో విభేదాలు సృష్టించాలని చూస్తున్న సంఘ వ్యతిరేక శక్తుల చర్యలను నియంత్రించడంలో ప్రభుత్వం పోలీసులకు సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
Read Entire Article