తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్లో.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమైంది. రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న యాసంగి సీజన్ రైతు భరోసా నిధులు విడుదలపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఫిబ్రవరి 17వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాలలో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందే డబ్బులు జమ చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాలతో ఈ ప్రక్రియ జరగలేదు. ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో ఫిబ్రవరి 17న విడుదల చేసేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.