తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. పారిపాలన కారణాలతో పాటు ప్రమోషన్లతో కూడా అధికారులను బదిలీ చేసింది. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగణంగానే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మున్సిపల్ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.