కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. తాను కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకువస్తానని తేల్చి చెప్పారు. తొలి విడతలో భాగంగా రూ.500 కోట్లను తెలంగాణకు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే కేంద్రం నుంచి వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చినట్లు వెల్లడించారు. ఇక తాజాగా పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.