మున్సిపల్ కమిషనర్లు, అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది అధికారులు క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించడం లేదని తెలిపారు. త్వరలోనే తాను ప్రతీ జోన్లో పర్యటిస్తానని.. విధుల్లో అలసత్వం వహిస్తే.. అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని తీవ్ర హెచ్చరికలు చేశారు. జీహెచ్ఎంసీ విభజన సమస్యల పరిష్కారానికి సూచనలు అందించారు. కొత్తగా ఎన్నికైన మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లకు ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు.