ముస్లింలకు గౌరవం కల్పించింది కాంగ్రెస్ పార్టీనే.. రేవంత్ రెడ్డి స్పష్టం

4 months ago 9
జూబ్లీహిల్స్‌ బైపోల్స్ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా షేక్‌పేట్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం.. ముస్లింలకు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాన్ని వివరించారు. దేశంలో, రాష్ట్రంలో ముస్లింలకు హస్తం పార్టీ ఎప్పటి నుంచో సమున్నత స్థానాన్ని కల్పించిందని గుర్తు చేశారు. తాను మొదటి నుంచి సెక్యులర్‌ భావాలు ఉన్న వ్యక్తిని అని.. అయితే తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు అనేక అవకాశాలు కల్పించిందని చెప్పారు. కొడంగల్‌లో తాను 3 సార్లు గెలవడానికి మైనార్టీల సహకారం ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ 20 నెలల పాలనలో మైనార్టీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని వెల్లడించారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడాన్ని బీజేపీ ఓర్చుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు.
Read Entire Article