హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు, పాలనా సౌలభ్యం కోసం నగరాన్ని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సైబరాబాద్తో సహా శివారు ప్రాంతాలను కలుపుతూ కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు లక్ష్యంగా ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.