తెలంగాణలో వ్యవసాయ విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే నిజామాబాద్, నల్గొండ, వికారాబాద్ జిల్లాల్లో మూడు కొత్త వ్యవసాయ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు అధునాతన వ్యవసాయ విద్య అందుబాటులోకి రానుంది.