ఖమ్మం జిల్లాలో దారుణం వెలుగు చూసింది. విద్యార్థులకు మంచి, చెడు నేర్పి.. వారిని సక్రమమైన మార్గంలో నడపాల్సిన టీచర్.. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణంగా ప్రవర్తించాడు. రోజులు కాదు ఏళ్ల తరబడి బాలుడిని లైంగికంగా వేధిస్తున్నాడు. తాజాగా విద్యార్థి దీని గురించి తన తల్లిదండ్రులకు తెలపడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కేసు నమోదు అయిందన్న విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ వివరాలు..