మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని మత సామరస్యానికి ప్రతీకగా అభివృద్ధి చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా మంచిరేవులలో 800 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో భారీ 'ఓంకారేశ్వర మందిర' నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి మార్చి 28న శంకుస్థాపన చేయనున్నారు. రూ. 700 కోట్ల అంచనా వ్యయంతో, శృంగేరి పీఠం సూచనల మేరకు ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. అలాగే నదిలో 100 అడుగుల శివుని విగ్రహం, పార్కులు, బోటింగ్ సౌకర్యాలతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు.