మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నదికి ఇరువైపులా 30 మీటర్ల వెడల్పుతో 6 లైన్ల రోడ్డు నిర్మించనున్నట్లు ఎంఆర్డీసీఎల్ ఎండీ తెలిపారు. ఈ రోడ్లు ఇది ప్రధాన హైవేలను అనుసంధానిస్తుందని అన్నారు. 50 మీటర్ల బఫర్ జోన్ పాటిస్తూ.. మురుగునీటి శుద్ధి, గాంధీ సరోవర్ అభివృద్ధి చేపట్టనున్నట్లు తెలిపారు. వచ్చే వారం DPR ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని.. ఇది కేవలం నది ప్రక్షాళన మాత్రమే కాదు, నగరం సమగ్ర ఆర్థికాభివృద్ధి వ్యూహమని వెల్లడించారు.