మూసీ పునరుజ్జీవం కోసం ప్రభుత్వం నుంచి పైసా ఖర్చు చెయ్యబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) పద్ధతిలో డెవలప్మెంట్ పనులు చేపడతామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నగరంలో గణనీయంగా అభివృద్ధి చెందుతుందని.. ఊహించని విధంగా మారిపోతుందని చెప్పారు. ఫస్ట్ ఫేజ్లో బాపూఘాట్ వరకు 21 కి.మీ. మేర అభివృద్ధి చేయనున్నట్లు స్పష్టం చేశారు. బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనునన్నట్లు తెలిపారు.