కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది మూసీ బ్యూటిఫికేషన్ కాదని... మూసీ లూటిఫికేషన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. మూసీ సుందరీకరణపై డీపీఆర్ కాదు.. ప్రాజెక్టు రిపోర్టు కూడా లేదని అన్నారు. రాహుల్ గాంధీకి డబ్బు సంచులు పంపేందుకే మూసీ ప్రాజెక్టు, హైడ్రా తెరపైకి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.