Nandyal SSC Student Sara Death Tragedy: నంద్యాల జిల్లాలో ఒక విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. పదో తరగతి పరీక్షలు రాసిన సారా అనే విద్యార్థిని ఫలితాల కోసం ఎదురు చూస్తూ అనారోగ్యంతో మరణించింది. చనిపోయే ముందు 500 పైగా మార్కులు వస్తాయని చెప్పిన సారా, ఫలితాల్లో 557 మార్కులు సాధించింది. కూతురు మరణించిన తర్వాత ఫలితాలు రావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చదువులో గెలిచినా, జీవితంలో ఓడిపోయిన సారా కథ అందరినీ కలచివేస్తోంది.