హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు నేటి నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త ఛార్జీలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వారిపై అదనపు భారం పడుతోంది. తాజాగా మెట్రో ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపే ఈ పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా రవాణా ప్రజలకు అందుబాటులో ఉండాలని, లేదంటే ట్రాఫిక్, కాలుష్యం పెరుగుతాయని హెచ్చరించారు.