తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నగదు రవాణాపై కఠిన నిబంధనలు విధించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లేందుకు సరైన పత్రాలు తప్పనిసరి. అయితే మెట్రోలో కూడా నగదు రవాణా మీద ఆంక్షలున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్లో రూ.3.5 లక్షలతో వచ్చిన ప్రయాణికుడికి ప్రవేశం నిరాకరించారు. మెట్రోలో RBI నిబంధనల ప్రకారం రూ.2 లక్షల వరకు మాత్రమే అనుమతి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..