హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. అన్ని టెర్మినల్స్లో తెల్లవారుజామున 6 గంటలకు తొలి మెట్రో ప్రారంభం అవుతుందని హైదరాబాద్ మెట్రో వెల్లడించింది. ఇక చివరి మెట్రో రాత్రి 11 గంటల వరకు బయలుదేరుతుందని తెలిపింది. ఈ రైలు వేళల్లో మార్పులు ఈనెల 3వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు స్పష్టం చేసింది. మారిన మెట్రో రైలు టైమింగ్స్ దృష్టిలో ఉంచుకుని.. ప్రయాణికులు తమ ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని ఒక ప్రకటన విడుదల చేసింది.