తెలంగాణ ప్రభుత్వ పీజీ వైద్య కళాశాలల్లో కొత్తగా 102 ఎండీ సీట్లను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మంజూరు చేసింది. ఈ పెంపుతో మొత్తం సీట్ల సంఖ్య 1,376కు చేరింది. హైదరాబాద్లోని ఈఎస్ఐ ఆసుపత్రి కళాశాలలో అత్యధికంగా 23 సీట్లు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపరచడానికి ఈ చర్యలు దోహదపడనున్నాయి.