ఒకవైపు ఎదిగిన కుమారుడికి అరుదైన వ్యాధి. మరోవైపు.. సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో జీవనం. అయితే కుమారుడి పరిస్థితి చూసి.. వారికి ఎవరూ ఇల్లు అద్దె ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఎన్ని ఇళ్లు తిరిగినా ఎవరూ కనికరించలేదు. దీంతో ఆ కుటుంబం తమకు న్యాయం చేయాలంటూ.. అధికారులను ఆశ్రయించింది. దీంతో ఏకంగా సీఎం ఆఫీస్ స్పందించింది. తక్షణమే ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించారు. ఈ ఘటనతో ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచినట్లయింది.