లియోనెల్ మెస్సీ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 3 వేల మంది సిబ్బందితో మూడు అంచెల భద్రత, 450 సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణతో పాటు మెస్సీకి 'జడ్' కేటగిరీ భద్రత కల్పించారు. ప్రేక్షకులు టికెట్ లేనివారు రావద్దని, రవాణాకు ఆర్టీసీ, మెట్రో ఉపయోగించాలని సూచించారు.