రైతుల కష్టాలు తీర్చేందుకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించింది. మార్కెట్లో ధరలు పడిపోవడంతో నష్టపోతున్న రైతులకు ఇది ఊరటనివ్వనుంది. దీపావళి తర్వాత మొదలవ్వాల్సిన కొనుగోళ్లు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దీంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.