తెలంగాణలో భూముల మార్కెట్ విలువలను మే మొదటి వారం నుంచి సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల ఉపసంఘం దీనిపై అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య చైనా తరహా పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేయడంతో పాటు 'హిల్ట్' విధానం ద్వారా పారదర్శక పద్ధతిలో భూ వినియోగ మార్పిడి చేపడతామని స్పష్టం చేసింది. పారిశ్రామికవేత్తల సూచనల మేరకు రాయితీలు, కొత్త జోన్ల కేటాయింపుపై ప్రభుత్వం దృష్టి సారించింది.