మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగిందని మంత్రి సీతక్క వెల్లడించారు. అంచనాలకు మించి కోట్లాది మంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నట్లు తెలిపారు. అయితే మేడారం జాతరకు సంబంధించి.. జరుగుతున్న అసత్య ప్రచారం, దుష్ప్రచారంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది కావాలనే మేడారం జాతర ఏర్పాట్లపై విష ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇక జాతరలో ఆమె చేసిన డ్యాన్స్పై వస్తున్న విమర్శలను కూడా ఆమె కొట్టిపారేశారు.