Special Buses to Medaram: తెలంగాణలో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో, భక్తుల సౌకర్యార్థం జాతర ప్రారంభానికి రెండు నెలల ముదు నుంచే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు రెడీ అవుతోంది. నవంబర్ 16 నుంచే హనుమకొండ నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. మహాలక్ష్మి పథకం ఈ బస్సులకు కూడా వర్తిస్తుందని అధికారులు తెలిపారు.