మొన్న జరిగిన కుంభమేళాలో ఓ యువతి కళ్లను చూసి అందరూ ఫిదా అయిపోయారు. కుంభమేళా మొనాలిసా అంటూ.. ఆమెను పెద్ద సెలబ్రిటీని చేసేశారు. నేడు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరలో ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ వేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సారలమ్మ గద్దెపైకి వచ్చే సమయంలో మంత్రి సీతక్కతో కలిసి ఆమె వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.