ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. భక్తులు, వీఐపీల కోసం రూ.5 కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టనున్నారు. మంత్రి సీతక్క కృషితో నిధులు విడుదలయ్యాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగుతుంది. కాకతీయ రాజుల కాలం నుంచి వస్తున్న ఈ జాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా.