ఇటీవల ముగిసిన మేడారం జాతరలో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడం పెను సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేసిన జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగి విచారణ చేపట్టి అసలు నిజం వెలుగులోకి తీసుకువచ్చింది. అసలు మేడారంలో బాలికపై గ్యాంగ్ రేప్ జరగలేదని ఎంక్వైరీ కమిటీ తేల్చి చెప్పింది. త్వరలోనే రిపోర్ట్ను అందించనుంది.