మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కారణమంటూ హైకోర్టులో కేసు వేసిన రాజలింగమూర్తి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తిని గతరాత్రి గుర్తు తెలియని దుండగులు కత్తులు, గొడ్డళ్లతో నరికి కిరాతకంగా హత్య చేశారు. గతంలో భూతగాదాల్లో అతడిపై కేసులు ఉన్నాయి.. ఆ కక్షలతోనే చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.