సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటన జరిగి రోజు గడవక ముందే హైదరాబాద్ శివారు మేడ్చల్ పారిశ్రామిక వాడలో మరో ప్రమాదం జరిగింది. ఆల్కలైడ్స్ బయో అక్టీవ్స్ ఫార్మా కంపెనీలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో కార్మికుడు గన్నారం శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అతడి పరిస్థితి విషమించడంతో తోటి కార్మికులు AIG ఆసుపత్రికి తరలించారు.