నల్గొండలో జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు మహమ్మద్ ముకర్రంకు ఉరిశిక్షతో పాటు రూ. 1.10 లక్షల జరిమానా విధించింది. 2013లో 12 ఏళ్ల బాలికపై ఈ దారుణం జరిగింది. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తి రోజా రమణి ఈ తీర్పును వెలువరించారు. ఈ తీర్పుపై బాలిక కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.