ఏపీని మొంథా తీవ్ర తుపాను భయపెడుతోంది. మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు తీరం దాటే ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకూ ప్రభావం అధికంగా ఉంటుందని వాాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేసింది. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ రహదారులపై భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. సురక్షితమైన ప్రాంతాల్లో వాటిని నిలుపుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.